ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరో శ్రీకాంత్ 'జై సేన' టీజర్ ని రిలీజ్ చేసిన కింగ్ నాగార్జున!

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 23, 2019, 05:46 PM

సీనియర్ హీరో శ్రీకాంత్ వి సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జై సేన'. 'పవర్ ఆఫ్ యూత్' అనేది ఉపశీర్షిక'. వచ్చే యేడాది ఫిబ్రవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదల చేశారు. ఇందులో దేశానికి బలం యువత అని చూపించినట్టు టీజర్ ని చూస్తే అర్థమవుతోంది. శ్రీకాంత్ చేత చెప్పిన డైలాగులు ఆ జోనర్ లోనే ఉన్నాయి. 'మూడు పూటల అన్నం తినాలని ప్రతిఒక్కరికి గుర్తుంటుంది. కానీ, అన్నం పండించే రైతు బాగుండాలని ఎవరు ఆలోచించడం లేదు', 'మీ లాంటి కుర్రాళ్లు ఆయాస పడితే బాడీకి లాసు. మోడీగారు ఆవేశ పడితే మన ఇండియాకు లాసు' అనే డైలాగ్స్ ఆకట్టుకొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa