ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 25, 2019, 12:10 AM

సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమాకు కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కాలభైరవ మాట్లాడుతూ “సినిమా సెట్స్‌పైకి వెళ్లే సమయంలో చివరి నిమిషంలో మ్యూజిక్ డైరెక్టర్‌గా నేను ప్రవేశించాను.
ఈ సినిమా నిర్మాత చెర్రీ నాకు ఈ అవకాశం ఇచ్చారు. నిజానికి కథ విన్నప్పుడు అసలు ఈ సినిమాకు పాటలు అవసరం లేదనిపించింది. అందుకే ఈ చిత్రంలో పాటలు లేవు కదా అనే ఫీలింగ్ కలగలేదు. ఒకవేళ ఎంత మంచి పాట పెట్టినా అది ఈ కథకు ఉపయోగపడదు. పాటలు లేకపోయినా నేపథ్య సంగీతం మాత్రం సినిమా మొత్తం ఉంటుంది. అది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక చిన్నప్పటి నుండి నేను నాన్నగారి దగ్గరే పని చేశాను కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆయనంటేనే ఎక్కువ ఇష్టం. అలాగే మణిశర్మ, తమన్ కూడా ఇష్టమే”అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa