సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై టి. అంజయ్య సమర్పణలో నైనా గంగూలి, సూరి హీరోహీరోయిన్లుగా అగస్త్య మంజు దర్శకత్వంలో బ్యూటిఫుల్ . ఇప్పటికే విడుదలైన పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. జనవరి 1న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల చేస్తున్న సందర్భంగా శనివారం హైద్రాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.. రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ ‘నేను రొమాంటిక్ ప్రేమకథా చిత్రం తీసి యుగాలై పోయింది. క్రిందటి జన్మలో రంగీల సినిమా తీసాను. ఇది ఆ సినిమాకు సీక్వల్ గా ఉండవచ్చు. సాధారణంగా మగవాళ్ళు ఎదిగితే ఆడవాళ్లు వెనుక ఉంటారు. ఈ సినిమాలో అందుకు బిన్నంగా హీరోయిన్ ఎదుగుతుంటే హీరో వెనుక ఉంటాడు, అయితే హీరోయిన్ ఎదుగుదలను హీరో తట్టుకోగలడా లేదా ? అన్నది ఈ చిత్రం కాన్సెప్ట్. నా మదిలో మెదిలిన ఈ పాయింట్ ను అగస్త్య మంజు కు చెపితే దీనిని అద్భుతమైన ప్రేమకథా చిత్రంగా మలిచాడు. ఇందులో విలన్స్ ఉండరు. సినిమా అంతా సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. సంగీత భరితంగా ఉంటూనే రొమాన్స్ పరంగా కూడా ఆకట్టుకుంటూ కన్నీళ్లు తెప్పించే సన్నివేశాలతో మిలితమై ఉంటుంది. హీరోయిన్ నైనా ఈ పాత్ర కోసమే పుట్టిందా…అనిపించే విదంగా ఉంటుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa