తారల వివాహబంధం… బలహీనమవుతోంది. ప్రేమించు కున్నంత కాలం పెళ్లి చేసుకున్నాక కలిసి ఉండలేకపోతున్నారు. తాజాగా ఈ లిస్ట్లో నటి శ్వేతబసు ప్రసాద్ చేరింది. తెలుగులో కొత్త బంగారు లోకం చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన బసు బాలనటిగా సుపరిచితమే. హీరోయిన్గా మరికొన్ని చిత్రాలు చేసినా ఆశించిన బ్రేక్ రాలేదు. మధ్యలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంది. ఆ తర్వాత రోహిత్ మిట్టల్ అనే సినిమా డైరెక్టర్ను వివాహం చేసుకుంది. రెండేళ్ళ క్రితమే వీరి వివాహం జరిగింది. కొంతకాలం కలిసి ఉన్నారు. ఆ తర్వాత మనస్పర్ధలు తెలెత్తాయి. వీరి దాంపత్య జీవితంలో మనస్పర్ధలు తలెత్తాయని ప్రచారం జరిగింది. దీనిపై కొంతకాలం ఏమీ మాట్లాడని శ్వేతబసు తాజాగా వివరణ ఇచ్చింది. మీరు విన్నది నిజమే… మేము చట్టపరంగా విడిపోయేందుకు నిర్ణయం తీసుకున్నాం. విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం అని చెప్పారు. ప్రస్తుతానికి దూరంగా ఉన్నా, విడిపోయినా మళ్లిd మేము కలిసి పనిచేస్తామనే నమ్మకం ఉందని చెప్పింది. పరస్పర అంగీకారంతో విడిపో తున్నాం. మా జీవితం సంపూర్ణమైనది కానప్పటికీ, స్నేహితుల్లాగే కలిసి ఉంటామని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa