ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజిని కోసం కోటి రూపాయలు పారితోషికం తగ్గించిన నయనతార...

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2020, 06:42 PM

తన నటనతో  తెలుగు .. తమిళ  ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ నయనతార . తమిళంలో ఆమె చేసిన సినిమాలు తెలుగులోనూ విడుదలవుతుంటాయి . లేడీ సూపర్ స్టార్ గా పిలవబడే ఈ అమ్మడు  దక్షిణాదిలో ఖరీదైన నటిగా పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు తో సినిమా చెయ్యాలంటే అది కచ్చితంగా భారీ బడ్జెట్ సినిమా అయ్యుండాలి. తాజగా నయన్ రజినీకాంత్ తో కలిసి 'దర్భార్' సినిమా లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు టాప్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకోసం  నయన్ ఏకంగా 5.5 కోట్లు తీసుకుంది. దానికి తోడు అమ్మడు బస చేయడానికి ఫైవ్ స్టార్ హోటళ్లు, ప్లైట్..ఇతర సౌకర్యాలు తప్పని సరి.ఇచ్చిన కాల్ షీట్స్ కంటే ఒక్కరోజుకూడా ఎక్కువ షూటింగ్ లో పాల్గొనదు. ఇక సినిమా ప్రమోషన్స్ కు నయన్ రాదన్న విషయం తెలిసిందే. తాజగా ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ ను తగ్గించిందట అదికూడా రజినీ సినిమా కోసం. ప్రస్తుతం శివ దర్శకత్వం లో రజినీ నటిస్తున్న సినిమాలోనూ నయన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా టైటిల్ అన్నాతై ( తెలుగులో పెద్దన్నయ్య ) . ఈ సినిమాను సన్ పిచర్స్ నిర్మిస్తుంది. రజినీతో రెండో సారి కావడం తో కోటి తగ్గించి ఇవ్వండని నిర్మాతలకు చెప్పిందట దాంతో పట్టరాని సంతోషంతో వెంటనే అగ్రిమెంట్ చేసుకున్నారట నిర్మాతలు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa