ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అసలు ఏం జరిగిందంటే' విడుదలకు సిద్దమవుతుంది...

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2020, 04:50 PM

ఇటీవల కాలంలో క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. తక్కువ బడ్జెట్ తో చేసే ఈ సినిమాలు కంటెంట్ బాగుంటే చాలు వసూళ్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. అందువలన ఆ తరహా కథలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలా రూపొందిన చిత్రమే 'అసలు ఏం జరిగిందంటే'. అనిల్ బొద్దిరెడ్డి నిర్మాణంలో .. శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో, మహేంద్రన్ .. శ్రీ పల్లవి .. కారుణ్య .. కరోన్య ప్రధానమైన పాత్రలను పోషించారు.


ఫస్టు కాపీ వచ్చిన సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ .. "జీవితం మలుపు తిరగడానికి ఒక్క క్షణం చాలు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మితమైంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో చేసిన మహేంద్రన్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, యు/ఎ సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. ఈ నెల 9వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి, నెలాఖరులో సినిమాను విడుదల చేస్తాము" అని చెప్పాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa