సూపర్ స్టార్ మహేష్ బాబు 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ జోష్ తో తన 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయాలనుకున్న మహేష్ బాబు ఏదో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. మహేష్ తదుపరి చిత్రం ఎవరి దర్శకత్వం లో అనే విషయం పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కాని వంశీ పైడిపల్లి తో సినిమా క్యాన్సిల్ అంటూ వార్తలు వచ్చిన వెంటనే అంతా కూడా పరశురామ్ వైపు చూశాడు.
పరశురామ్ ప్రస్తుతం నాగ చైతన్యతో నాగేశ్వరరావు సినిమాను చేసే పనిలో ఉన్నాడు. అయినా కూడా మహేష్ బాబు నుండి వచ్చిన పిలుపుని ఆయన కన్సిడర్ చేసి నాగేశ్వరరావును పక్కకు పెట్టే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. అయితే ఆ వార్తలు వచ్చి చాలా రోజులు అయినా ఇప్పటి వరకు అధికారికంగా క్లారిటీ అయితే రాలేదు. అయినా కూడా వార్తలు మాత్రం ఆగడటం లేదు. తాజాగా ఆ వార్తలకు కొనసాగింపు అన్నట్లుగా వారిద్దరి కాంబో మూవీ స్టోరీ లీక్ అంటూ వార్తలు వస్తున్నాయి.వైట్ కాలర్ మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. భారత ఆర్ధిక వ్యవస్థ పై దెబ్బ పడేలా బ్యాంకుల నుండి భారీ మొత్తాలను రుణాలు గా పొంది వాటిని ఎగవేసి విదేశాలకు వెళ్లిన విజయ్ మాల్య మరియు నీరవ్ మోడీల పాత్రలను ఈ చిత్రంలో చూపించబోతున్నారట. అలాంటి మోసాల నుండి దేశాన్ని.. దేశ ఆర్థిక వ్యవస్థను హీరో ఎలా కాపాడాడు అనేది కథగా పరశురామ్ మహేష్ బాబు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa