ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఉప్పెన' క్రేజ్ కు కారణం వారేనా?

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 09, 2020, 02:17 PM

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్, సుకుమార్ శిష్యుడు డైరెక్షన్ లో 'ఉప్పెన' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో వైష్ణవ తేజ్ వెండి తెరకు పరిచయం అవుతున్నాడు.ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రబృందం విడుదల చేసినప్పుడు ఈ సినిమాలు అంతగా అంచనాలు లేవు. కానీ ఎప్పుడైతే ఈ సినిమా యొక్క మొదటి సాంగ్ విడుదలయిందో అప్పటి మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ దేవీశ్రీ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. సుకుమార్ మీద నమ్మకం, దేవిశ్రీ మీద భరోసా వేసి మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు దాదాపు 20కోట్ల బడ్జెట్ పెట్టిందనే టాక్ ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే హీరో, హీరోయిన్ కన్నా ఎక్కువగా విలన్ కి రెమ్యునరేషన్ అధికంగా ఇచ్చారట. ఉప్పెన లో విలన్ గా చేస్తున్న విజయ్ సేతుపతి 7 కోట్లు ఇచ్చారట. అయితే టైటిల్ దగ్గరనుండి సినిమా మీద పోజిటివిటి కనబడడం, లుక్ లోను, మ్యూజిక్ విషయంలోనూ పోజిటివిటి ఉండడంతో.. ఈ సినిమాకి 15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ మిగతా 10 కోట్లు డిజిటల్, శాటిలైట్ హక్కులు కింద వచ్చేస్తాయనే ధీమాతో మైత్రి మూవీస్ ఉందట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa