తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరైనా గొప్పవారు ఉన్నారంటే ఆయన మెగాస్టార్ చిరంజీవి ఒక్కరేనని థర్టీ ఇయర్ ఇండస్ట్రీ అంటూ ప్రేక్షకులకు పరిచయమైన సినీ నటుడు పృథ్విరాజ్ అన్నారు. ఈయన ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా దిగిపోయారు. ఓ మహిళతో ఫోనులో అసభ్యంగా మాట్లాడిన ఆడియో ఒకటి లీక్ కావడంతో ఆయన్ను ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారు దించివేసింది.ఈ నేపథ్యంలో ఆయన తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తాను మహిళా ఉద్యోగితో మాట్లాడినట్లు వచ్చిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ ఫేక్ అని మరోమారు స్పష్టం చేశారు. అందులో తనను మద్యం తాగిన వాడిగా చిత్రీకరించారని ఆరోపించారు. కానీ తాను మద్యం మానేసి ఏడాది కాలమైందని, తానేమీ దేశ ద్రోహం చేయలేదని అన్నారు.
ఇకపోతే, సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారితో నేను సైద్ధాంతికంగా మాట్లాడాను. దాని వల్ల నాకు చాలా సినిమాలు పోయాయి. సినిమా రంగంలో ఎవరైనా గొప్ప వ్యక్తి ఉన్నారా? అంటే చిరంజీవిగారు. అలాగని మిగతావారిని నేను తక్కువ చేసి మాట్లాడలేదు. నేను మానసికంగా ఇబ్బందిపడ్డానని, నాకు వేషాలు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని చెప్పిన వ్యక్తి చిరంజీవిగారు. ఆయన లేకపోతే నేను సూసైడ్ కూడా చేసుకునేవాడిని. మహిళల పట్ల నేనెప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదని ఆయన చెప్పుకొచ్చారు.
అదేసమయంలో వైకాపా కార్యకర్తగా పలు రకాలైన ఆరోపణలను ఎదుర్కొన్నప్పుడు పార్టీ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని నా పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. తాను పదవుల కోసం ఎన్నడూ ఆరాటపడలేదన్నారు. రైతు ఉద్యమం గురించి నేను మాట్లాడితే దాన్ని వక్రీకరించారు. పోసాని కృష్ణమురళితో తిట్టించారు. దివ్యవాణిగారు నన్ను కుక్క అన్నారు. అయితే మా పార్టీలోనే నా తీరు నచ్చనివారున్నారు. నాకు ఈ పదవి రాకూడదని అనుకున్నవారు చాలా మంది ఉన్నారు. నా జాతకం ప్రకారం నన్ను ఇబ్బంది పెట్టినవారు ఎవరూ బతికిలేరు. ఈరోజు నేను రోడ్డు మీద ఉన్నాను. విదేశాల్లో పాస్ పోర్ట్ పోయినవాడిలా ఉన్నానని ఆవేదన వెలుబుచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa