ఎన్టీఆర్, రామ్ చరణ్ల తన అభిమానులతో సామాన్య ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన ఆరు సూత్రాలను పాటిస్తే కరోనా బారి నుంచి ప్రజలు తమను తాము రక్షించుకోవచ్చని చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా వీళ్ల బాటలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు.. కరోనా వైరస్ పై తనదైన శైలిలో స్పందించాడు. కరోనా వైరస్ నేపథ్యంలో అందరు సామాజికంగా దూరం పాటించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అంతేకాదు ప్రజలందరు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మసులుకోవాలన్నారు. ప్రస్తుతం చాలా మంది ప్రజలు ఇంట్లోనే తమ కాలాన్ని వెల్లబుచ్చుతున్నారు. కరోనా వైరస్ విషయానికొస్తే.. చైనాలో పుట్టిన ఈ మహామ్మారి ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచాన్ని వణికిస్తోంది.. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బతో చైనాతో పాటు భారత్ సహా అన్ని దేశాలు గజ గజ వణికిపోతున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు దేశాలు ఆర్ధికంగా కుదేలవుతున్నాయి. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం పడకేసింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్ధిక వృద్ధి మందగించింది. దీనిపై భారత ప్రభుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యవరస ఆరోగ్య ఎమర్జన్సీ ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్కూల్లు, కాలేజీలు, థియేటర్స్. పబ్స్, జిమ్స్ ఇలా వైరస్ ఎఫెక్ట్ అయ్యే అనింటినీ ఈ నెల 31 వరకు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వైరస్ ఎఫెక్ట్ కారణంగా నటీనటులతో పాటు రాజకీయ నాయకులు ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa