ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా దెబ్బకు ఛార్మి పూరిల ఆఫీస్‌ బంద్...

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 17, 2020, 04:21 PM

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చాపకింద నీరులా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. చైనాలో వెలుగు చూసిన కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది.సామాన్యులు మొదలుకొని సినీ, రాజకీయ, క్రీడ.. ఇలా అన్ని రంగాలను భయపెడుతోంది. ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్‌తో సినీ రంగం చాలా నష్టపోతోంది. షూటింగ్స్ రద్దవడంతో పాటు సినిమాల విడుదల తేదీలు మారడం ఇలా అనుకున్న సమయానికి సినిమా విడుదలకాకపోతే ఎంతో నష్టపోతాడు నిర్మాత. ఈ కరోనా దెబ్బకు తెలుగులో కూడా చాలా సినిమాలు షూటింగ్‌లను రద్దు చేసుకున్నాయి. తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అయితే కరోనా ధాటికి తన ఆఫీస్‌నే క్లోజ్ చేశాడు. కరోనా మహమ్మారి నుండి తన ఆఫీస్ స్టాఫ్‌ను కాపాడుకునేందుకు ప్రస్తుతానికి క్లోజ్ చేస్తున్నామన్నాడు. ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటించి జాగ్రత్తగా ఉండాలనీ.. ఈ కరోనా చేస్తోన్న దాడిని అందరం కలసికట్టుగా పోరాడి ఓడించాలనీ కోరాడు. దీనికి సంబందించి ఓ ప్రకటనను నిర్మాత ఛార్మి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa