కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న తన సినిమా ‘ఆచార్య’ చిత్రీకరణను తక్షణం వాయిదా వేస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా ప్రజా సహకారం కూడా అవసరం అని ఆయన పిలుపునిచ్చారు. కరోనా నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది.మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే కచ్చితంగా దర్శకులకు అంతకంటే కావాల్సింది మరొకటి ఉండదు. కానీ ఇప్పుడు మాత్రం మెగాస్టార్ సినిమా అంటే కాస్త ఆలోచిస్తున్నారు దర్శకులు. దానికి కారణం కొరటాల శివ. ఈయన ఓకే అంటే ఇండస్ట్రీలో నో చెప్పే హీరో ఉండడు. ఎందుకంటే ఈయన కెరీర్ అలా ఉంది మరి. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా ఆయా హీరోల కెరీర్స్ లో పెద్ద హిట్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు కొరటాల. అలాంటి దర్శకుడు భరత్ అనే నేను తర్వాత రెండేళ్లైనా మరో సినిమా తీసుకురాలేదు. దానికి కారణం చిరంజీవి.ఆయనకు కథ చెప్పి ఏడాది వేచి చూసాడు.. ఆ తర్వాత మరో ఏడాది సైరా కోసం ఆగాల్సి వచ్చింది. అన్నీ సెట్ అయ్యాయి అనుకుంటున్న సమయంలో మధ్యలో చిన్న చిన్న బ్రేకులు వస్తూనే ఉన్నాయి. దాంతో కొరటాల కాస్త ఇరిటేట్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఒక్క సినిమా కోసం మరీ మూడేళ్లు వేచి చూడటం ఏంటో అని సన్నిహితుల దగ్గర కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. చిరంజీవి లాంటి హీరో కోసం కొంత సమయం పర్లేదు కానీ మరీ ఇంత సమయం అయితే ఎలా అని ఆయన ఫీల్ అవుతున్నట్లు సమాచారం.ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న తీరు చూస్తుంటే ఈ చిత్రం ఈ ఏఢాది వస్తుందా రాదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ సినిమాలో మహేష్ బాబు ఉంటాడనే ప్రచారం జరిగినా కూడా రెమ్యునరేషన్ కారణంగా ఆయన్ని తప్పించడంతో రామ్ చరణ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. అయితే రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న ఈయన మరో ఆర్నెళ్ల వరకు ఈ సినిమా వైపు చూడడు. దాంతో ఆచార్య ఈ ఏడాది రావడం కష్టమే అంటున్నారు. కానీ కొరటాల శివ మాత్రం ఇదే ఏఢాది సినిమాను పూర్తి చేసి విడుదల చేసి.. వచ్చే ఏడాది మరో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈయన తన తర్వాతి సినిమాను రామ్ చరణ్ తోనే ప్లాన్ చేసుకుంటున్నాడు. మొత్తానికి చిరంజీవిని నమ్ముకుని బాగానే ఎఫెక్ట్ అయినట్లు కనిపిస్తున్నాడు ఈ సంచలన దర్శకుడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa