'అ ఆ' సినిమాలో అనుపమ గడుసు పిల్లగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్.. 'ప్రేమమ్' అనే సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉందీ ఈ మలయాళీ కుట్టి. అయితే టాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనుపమ పరమేశ్వరన్ కేరీర్ ప్రారంభంలో దిల్ రాజు నిర్మాణంలో శర్వానంద్ హీరోగా 'శతమానం భవతి' అనే సినిమా చేసింది. ఆ ఏడాది ఇది ఉత్తమ జాతీయ చిత్రంగా నిలిచింది. దీంతో ఆమె కెరీర్కు ప్లస్ అయింది. ఆ చిత్రంలో అవకాశం ఇచ్చింది నిర్మాత దిల్ రాజు. ఇదే బ్యానర్లో మరోసారి రామ్ సరసన 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రం కూడా చేసింది. అయితే ఆ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. కాగా మరోసారి దిల్ రాజు బ్యానర్లో మరో సినిమా చేస్తోంది. దిల్ రాజు మేనల్లుడు అశిష్ రెడ్డి హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రంలో అనుపమ హీరోయిన్గా చేసేందుకు గ్రీన్సిగల్ ఇచ్చింది. అయితే ఎక్కువ పారితోషికం ఇస్తే తప్ప కొత్త హీరోల సరసన నటించరు కొంత ఫేమ్ ఉన్న హీరోయిన్స్. కానీ అనుపమ మాత్రం తనకు నటిగా తెలుగులో కెరీర్ను బిల్డప్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు కదా అన్న కృతజ్ఞత భావంతో ఈ సినిమాను చేసేందుకు అంగీకరించిందట.ఈ చిత్రాన్ని 'హుషారు' దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి రూపొందిస్తున్నాడు. పెద్దగా పబ్లిసిటీ లేకుండానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయింది. కాగా ఆమె తెలుగులో ఇటీవల చేసిన 'రాక్షసుడు' మంచి విజయం సాధించింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేసిన ఈ సినిమాలో టీచర్ పాత్ర చేసిన అనుపమ తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత చాలా రోజులకు అనుపమ తెలుగులో ఈ సినిమాకు ఓకే చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa