సావిత్రి పాత్రలో నటించింది అనసూయ , సావిత్రి బయోపిక్ పుణ్యమా అని మహానటి పేరు మళ్లీ పాపులర్ అయిపోయింది. దాంతో ఇప్పుడు మరోసారి ఆ పాత్రకు ప్రాణం పోసింది అనసూయ. ఇప్పటికే కీర్తి సురేష్ ఈ పాత్ర చేసి నేషనల్ అవార్డు కూడా అందుకుంది.ఇప్పుడు జీ తెలుగు ఉగాది ఈవెంట్ బాబు గారింట్లో బుట్ట భోజనంలో అనసూయ కూడా మహానటి పాత్రలో కనిపించింది. ఆమె జీవితాన్ని ఓ చిన్న స్కిట్ రూపంలో చేసి చూపించింది అనసూయ. దానికి మంచి రెస్నాన్స్ వచ్చింది కూడా. సావిత్రి పాత్రలో అనసూయ నటించడం ఇదే తొలిసారి కాదు. అప్పట్లో బట్టల షాప్ వాళ్లు కూడా ఈ మహానటి థీం వాడుకున్నారు. అప్పట్లో అనసూయ బ్రాండ్ అంబాసిడర్గా చందన బ్రదర్స్ అదిరిపోయే యాడ్ ఒకటి షూట్ చేసారు. మాయాబజార్లోని అహ నా పెళ్లంట పాటను వాళ్ల క్యాస్ట్యూమ్స్తో అనసూయతో షూట్ చేసారు.చందన బ్రదర్స్ యాడ్ అంటూ మధ్యలో ఎస్వీఆర్ పాత్రలో సింగర్ మనో కూడా కనిపించాడు. ఇప్పుడు మరోసారి ఇలాంటి స్కిట్ చేసింది ఈమె. ఓ వైపు షోలతో పాటు సినిమాల్లోనూ బిజీ అయిపోతుంది అనసూయ. పైగా నటనలో కూడా మెప్పు పొందుతుంది. రంగమ్మత్త పాత్రే దీనికి నిదర్శనం. అటు సినిమాలు.. ఇటు టీవీ షోలతో వేడి పుట్టిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అసలు యాంకర్ అంటే చాలా పద్దతిగా ఉండాలి.. చీరకట్టులో కనిపించాలనే రూల్స్కు బ్రేక్ చెప్పింది ఈ బ్యూటీ.పెళ్లి తర్వాత యాంకరింగ్లోకి వచ్చిన అనసూయ.. మిగిలిన యాంకర్లు అసూయ పడేలా ఎదిగింది. అన్నింటికీ అందాలనే పెట్టుబడిగా పెట్టేసింది. అందాల ప్రదర్శనలో మాత్రం ఇప్పటి హీరోయిన్లు కూడా పనికిరారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. వయసు ఉండగానే హీరోయిన్ నాలుగు రాళ్లు వేనకేసుకోవాలి.. అందుకే ఇన్నాళ్లూ ఇదే చేసింది అనసూయ. ఈ మధ్య మరింత ఎక్కువగా అందాలను ఆరబోస్తుంది అను. మొత్తానికి సినిమాలు, షోలతో రెండు చేతులా బాగానే వెనకేసుకుంటుంది ఈ బ్యూటీ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa