ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్ళి ప్రజల ముందుకు 30 ఏళ్ల క్రితం నాటి 'రామాయణ్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 27, 2020, 11:19 AM

30 ఏళ్ల క్రితం 1987లో నుంచి దూరదర్శన్ లో ప్రసారమైన రామాయణ్ సీరియల్ దేశ ప్రజలను ఉర్రూతలూగించింది. మన తెలుగు ప్రజలు కూడా ఆ సీరియల్ కు నీరాజనం పలికారు. హిందీ అర్థం కాకపోయినా...  ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ... సీరియల్  టైమ్ కి టీవీల ముందు  వాలిపోయేవారు.  ఆ తర్వాత ఎన్నో చానల్స్ వచ్చి... ఎన్నో సీరియల్స్ ప్రసారమై, ప్రేక్షకాదరణ పొందాయి. కానీ, ఆనాటి  రామాయణ్ మాత్రం ప్రజల మనసుల్లో నిలిచిపోయింది. మళ్లీ ఆ సీరియల్ ప్రసారమైతే బాగుండు  అని  మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనిపించే ఉంటుంది.  ఇప్పుడు ఆ కోరిక తీరబోతోంది. అవును. అలనాటి రామాయణ్ సీరియల్ ప్రేక్షకుల డిమాండ్  మేరకు మళ్లీ  ప్రసారం కాబోతోంది.రేపు (శనివారం) రామాయన్ తొలి ఎపిసోడ్  దూరదర్శన్ లో ప్రసారం కాబోతుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు... తిరిగి రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు సీరియల్ ప్రసారం అవుతుంది. ఈ వివరాలను కేంద్ర ప్రసార శాక మంత్రి ప్రకాశ్ జవదేవకర్ వెల్లడించారు.రామాయణ్ సీరియల్ ను రామానంద సాగర్ నిర్మించారు. ఈ సీరియల్ లో రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చికిలియా, లక్ష్మణుడిగా సునిల్ లాహ్రి నటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa