ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేమున్నామంటూ ముందుకొస్తున్న సినీ ప్రముఖులు

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 27, 2020, 12:39 PM

రీల్ లైఫ్ లో ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం కాదు.. రియల్ లైఫ్ లోనూ ఆపదలో ఉన్న వారికి సాయం చేసి నిజమైన హీరోలుగా నిలిచారు మన హీరోలు. దేశం మొత్తం కరోనా మహమ్మారి వలన క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో మేమున్నామంటూ అండగా నిలిచారు.


జనసేనాని పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి సీఎం రిలీఫ్ ఫండ్ కింద కోటి రూపాయలు, పీఎం రిలీఫ్ ఫండ్ కు మరొక కోటి రూపాయలు కలిపి మొత్తంగా 2 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. కరోనా మహమ్మారిని దేశం నుండి పారద్రోలడానికి నా వంతు కృషి నేను చేస్తున్నానని తెలిపారు పవన్.


పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ తో నావంతుగా 70 లక్షల రూపాయలను రెండు తెలుగు రాష్ట్రాలకు సీఎం ఫండ్ కింద విరాళంగా ఇస్తున్నాను అని ట్విట్టర్ వేదికగా తెలిపారు రామ్ చరణ్. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం అన్నారు. ఒక పౌరుడిగా మన దేశాన్ని కాపాడుకోవాలనుంటే నియమాలను తప్పకుండా పాటించాలన్నారు.


చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి ఎందరికో కొత్త జీవితాన్ని ఇచ్చిన మహేష్ బాబు మరోసారి తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల విరాళాన్ని మహేష్ బాబు. అంతేకాకుండా ప్రతిఒక్కరు ముందుకొచ్చి తమ వంతు సహాయాన్ని అందజేయాలని కోరారు. ఒక భారతీయ పౌరుడిగా నేను లాక్ డౌన్ పాటిస్తున్నాను. మీరు కూడా 21 రోజులు ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉండి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సహాయపడాలని మహేష్ బాబు కోరారు.


కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి పాటించవలసిన నియమాలను చిరంజీవి ఒక వీడియో రూపంలో తెలియజేసారు. తనవంతు అవగాహన కల్పిస్తున్న మెగాస్టార్ ఇప్పుడు చిత్ర పరిశ్రమ లోని కార్మికులతో సహా రోజూవారీ కూలిపని చేసుకుంటూ జీవనం గడిపే పలువురిని దృష్టిలో ఉంచుకోని కోటి రూపాయల విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.


కరోనాపై పోరాటానికి, ప్రభుత్వాలు పాటిస్తున్న నివారణ చర్యలకు తన వంతు బాధ్యతగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పీఎం రిలీఫ్ ఫండ్ కి 3 కోట్ల రూపాయలు, రెండు తెలుగు రాష్ట్రాల సిఎం రిలీఫ్ ఫండ్ కి కలిపి కోటి రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు.


ఇక మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా తన వంతుగా 75 లక్షల విరాళాన్ని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 50 లక్షలు, చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న వారికి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు.


వీరితో పాటు నిర్మాత దిల్ రాజు 20 లక్షలు, నాంది టీమ్ 50 మంది కార్మికులకు ఒక్కొక్కరి చొప్పున 10వేలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ 20 లక్షలు, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ 10 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa