ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రిష డేట్లు కుదరకనే తప్పుకుంది : చిరంజీవి

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 09, 2020, 07:17 PM

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా 'ఆచార్య' రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా ముందుగా త్రిషను తీసుకున్నారు. ఆ తరువాత ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. తన పాత్ర ప్రాధాన్యతను తగ్గించారనే విషయంపై ఆమె యూనిట్ సభ్యుల పట్ల అసహనాన్ని వ్యక్తం చేసిందనీ, ఆ కారణంగానే ఆమె తప్పుకుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.తాజా ఇంటర్వ్యూలో ఈ విషయానికి సంబంధించిన ప్రశ్న ఎదురుకావడంతో చిరంజీవి స్పందిస్తూ .. "ఈ విషయాన్ని గురించి నేను యూనిట్ సభ్యులతో మాట్లాడాను. ఎవరితోనూ ఆమెకి ఎలాంటి గొడవలేదు. ఏ విషయంపై ఎవరితోను విభేదాలు తలెత్తలేదు. మణిరత్నం  సినిమా కోసం ఆమె ఎక్కువ డేట్లు కేటాయించవలసి వచ్చింది. అందువల్లనే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. అంతేగానీ ఇందులో ఎలాంటి వివాదాస్పదమైన అంశం లేదు" అని చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa