తెలుగు ఇండస్ట్రీకి ప్రస్తుతం చిరంజీవి పెద్దన్నగా మారిపోయాడు. అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ముఖ్యంగా కరోనా కారణంగా పనిలేక ఆకలితో అలమటిస్తున్న సినిమా కార్మికులకు అండగా నిలబడ్డాడు మెగాస్టార్. ఆయన్ని నమ్మి తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా నిలబడింది. వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలని చిరు కూడా ఆలోచిస్తున్నాడు. ఇప్పటికే డబ్బులు ఇచ్చారు.. ఇప్పుడు ఫుడ్ కూడా సప్లై చేస్తున్నారు. దాంతో పాటు కరోనా మహమ్మారి అయిపోయిన తర్వాత ఓ కార్యక్రమం చేసి వాళ్లకు అండగా నిలబడాలని ఆలోచిస్తున్నాడు మెగాస్టార్. ఆయనకు నటీనటులు కూడా అండగా ఉన్నారు.ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి మరో ఆసక్తికరమైన ట్వీట్ చేసాడు. తెలుగు సినిమా కార్మికుల కోసం ఫుడ్ సప్లై మొదలైందని ఆయన వీడియోను పోస్ట్ చేసాడు. పేద సినీ కార్మికులను ఆదుకోడానికి మేం సిద్ధంగా ఉంటామని చెబుతున్నాడు ఈయన.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa