ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్, అల్లు అర్జున్ మధ్య మరోసారి పోటీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 13, 2020, 01:34 PM

మహేష్, అల్లు అర్జున్ సినిమాలు 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' ఒకేసారి సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాను ఒకే పండుగకు విడుదలవ్వడమే కాకుండా.. రోజుల తేడాతో విడుదల చేయడంతో పోలికలు ఎక్కువైయాయి. అంతేకాదు అభిమానుల మధ్య మావాడంటే మావాడంటూ ఇగోవార్ మొదలైంది. 'అల వైకుంఠపురములో' 'సరిలేరు నీకెవ్వరు' పై స్పష్టమైన కలక్షన్స్ ఆధిక్యం ప్రదర్శించినా ఈ రెండు సినిమాల కలక్షన్స్ ఫిగర్స్ ఫేక్ అంటూ ఇప్పటికి ఒక ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఇక ఇలాంటి పరిస్థితులలో పోయిన నెల ఉగాది రోజున బుల్లితెర పై ప్రసారం చేయబడ్డ 'సరిలేరు నీకెవ్వరు' రేటింగ్స్.. ప్రభాస్ 'బాహుబలి 2' టీఆర్పీ రేటింగ్స్ ను క్రాస్ చేయడంతో మహేష్ అభిమానులు పండుగ చేసుకున్నారు. కాగా త్వరలోనే 'అల వైకుంఠపురములో' మూవీని జెమినీ ఛానల్‌లో ప్రసారం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ సినిమా ఈ లాక్ డౌన్ రోజులలోనే ప్రసారం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే లాక్ డౌన్ పుణ్యమా అనీ జనం అంతా టీవీలకు అతుక్కుపోతున్న పరిస్థితులలో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' టిఆర్పీ రేటింగ్స్ ను బ్రేక్ చేయడం పెద్ద విషయమేమి కాదంటున్నారు బన్నీ అభిమానులు. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ ఇంతవరకు ఏ సినిమాను ప్రకటించలేదు. కాగా అల్లు అర్జున్ మాత్రం పుష్ప పేరుతో  ఓ సినిమాను చేస్తున్నాడు. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa