ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షూటింగ్ పై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చిన సోనాక్షి

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 15, 2020, 01:59 PM

ప్రపంచ మహమ్మారిగా మారి, ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోన్న నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో సాయపడడానికి సినీనటులు ముందుంటున్నారు.ఈ వైరస్ కట్టడికి కేంద్రం ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించింది. అయినా కేసులు తగ్గకపోవడంతో వచ్చే నెల 3వ తేది వరకు ఈ లాక్‌డౌన్‌ను పొడిగించారు. లాక్‌డౌన్ కారణంగా అత్యవసర సేవలు మినహాయిస్తే.. మిగతావన్నీ బంద్ అయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా సినిమాలు, సీరియల్స్  షూటింగ్స్ సహా అన్ని ఆగిపోయాయి. ఇలాంటి సమయంలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా షూట్‌లో పాల్గొన్నారని ఓ పత్రిక రాసింది. ఆమె ఫోటోను కూడా ప్రచురించింది. దీన్ని చూసిన దర్శక, నిర్మాత వివేక్ అగ్నిహోత్రి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా షూటింగ్ చేస్తారా ? అని ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ట్వీట్  చేసారు. దీన్ని చూసిన సోనాక్షి షాక్ అయ్యారు. ఫరాఖాన్ వ్యాఖ్యతగా వ్యవహరించిన ‘బ్యాక్ బెంచర్స్’ షో కోసం స్టూడియోకు వెళ్లినపుడు గత ఏడాది తీసిన ఫోటో అని ఆమె క్లారిటీ ఇచ్చింది. దీనిపై ఆమె ముంబాయి పోలీసులను ఆశ్రయించారు.దీనిపై సోనాక్షి సిన్హా.. వివేక్ అగ్నిహోత్రిని ఉద్దేశిస్తూ.. దేశమంతా లాక్‌డౌన్ ఉందని, అన్ని స్టూడియోస్ మూసేశారని మీకు తెలుసు. అది పాత ఫోటో. గత యేడాది నవంబర్ 5న తీసిన ఫోటో అని చెప్పింది. ఆ తర్వాత ఆమె ముంబాయి పోలీసులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను ట్యాగ్ చేస్తూ.. ఇలాంటి తప్పుడు వార్తలను, వదంతలను ప్రజలు ప్రచారం చేయకుండా ఉండాలంటే ఏమి చేయాలో చెప్పాలని కోరారు. బాధ్యతగల పౌరురాలిగా  భౌతిక దూరం పాటిస్తూ ఇంట్లోనే ఉన్నానని సోనాక్షి ట్వీట్ చేసింది. ఆ తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ఓ పత్రిక వ్యవహరించిన తీరును తప్పు పట్టారు. ఓ నటిగా దీన్ని దీన్ని ఖండించాలని సోనాక్షికి సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa