బంగారం సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించిన సనుష గుర్తుండే ఉంటుంది. ఓంకార్ దర్శకత్వం వహించిన జీనియస్ చిత్రంలో హీరోయిన్గా నటించిన సనుష ఆ తర్వాత తెలుగు తెరకు దూరమయింది. మల్లూవుడ్లో వరుస సినిమాలు చేస్తున్న ఈ యువనటి రైలులో ప్రయాణిస్తుండగా చేదు అనుభవం ఎదురైంది. కన్నూరు నుంచి తిరువనంతపురంనకు బుధవారం రాత్రి సనుష బయల్దేరింది. రైలులో ప్రయాణిస్తున్న ఆమెతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. తాను రైలులో నిద్రిస్తుండగా.. తన పెదాలను ఎవరో ముట్టుకున్నట్లు అనిపించిందని, ఉలిక్కిపడి నిద్రలేచానని ఆమె చెప్పింది. తన పై బెర్త్పై ఉన్న వ్యక్తి అని తెలుసుకుని.. చేయి అంతే పట్టుకుని లైట్ వేశానని సనుష తెలిపింది. తనను వేధిస్తున్నాడని తోటి ప్రయాణికులతో చెప్పుకున్నానని, కానీ ఏ ఒక్కరు సహాయం చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసు వచ్చి అతనిని అదుపులోకి తీసుకుళ్లే వరకూ తాను ఇబ్బంది పడినట్లు ఆమె చెప్పింది. చాలామంది సోషల్ మీడియాలో మాత్రమే అండగా ఉంటామని పోస్ట్లు పెడతారని, కానీ నిజజీవితంలో ఏ ఒక్కరూ సహాయం చేయరని సనుష తన అసంతృప్తిని వెళ్లగక్కింది. సనుష ఫిర్యాదుతో కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కన్యాకుమారికి చెందిన 40ఏళ్ల వ్యక్తి సనుషను వేధించినట్లు పోలీసులు తేల్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa