ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చివరి వరకు పోరాడి ఓడిన ఇర్ఫాన్ ఖాన్....క్యాన్సర్ మృత్యుంజయులు వీరే

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 29, 2020, 05:18 PM

ప్రస్తుతం ప్రపంచాన్ని కబళిస్తున్న మహమ్మారి క్యాన్సర్. వైరస్ లు అప్పుడప్పుడు పుట్టుకొచ్చి ప్రళయం సృష్టిస్తుంటే ఈ క్యాన్సర్ మాత్రం నిత్యం ప్రజల ప్రాణాలను హరించేస్తోంది. క్యాన్సర్‌ మహమ్మారి ఒకసారి దాడి చేసిందంటే అంతుచూసే దాకా వదలదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వైద్య రంగంలో కీమోథెరఫీ, రేడియేషన్‌, సర్జరీ వంటి విధానాలు ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది బలైపోతున్నారు. మానవాళిని పట్టిపీడుస్తున్న క్యాన్సర్ మహమ్మారిలలో సగానికిపైగా వ్యాధులు పూర్తిగా నివారించుకోదగ్గవే. అందువల్లే అనేక మంది ముందు క్యాన్సర్ ఓడిపోతుంది. అయితే క్యాన్సర్‌ వ్యాధి మహమ్మారిని సకాలంలో గుర్తించలేకపోవడంతో కొంతమంది మృత్యువాత పడుతున్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా ప్రతీ ఏడాది 12.5 లక్షల మందికి రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తే దాదాపు 50 శాతం మందికి క్యాన్సర్‌ నిర్ధారణ అవుతోంది. దేశంలో 2020 నాటికి క్యాన్సర్‌ బాధితులు దాదాపు 1.73 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని క్యాన్సర్‌ రిజిస్ట్రీప్రోగ్రామ్‌ అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి ఎప్పుడు ఎవరికి షాకిస్తుందో తెలీదు. అప్పుడే పుట్టిన చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్నవారి వరకు క్యాన్సర్ దాడి చేస్తోంది. ఇది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కానీ క్యాన్సర్ మెుదటి స్టేజ్ లో గుర్తు పడితే పర్వాలేదు కానీ ఫైనల్ స్టేజీ లో తెలిస్తే మాత్రం చాలా ప్రమాదం. ఇలా కాన్సర్ తో ఫైట్ చేసి గెలిచిన విజేతలు ఎందరో ఉన్నారు. ఆశ క్యాన్సర్ ఉన్నోడిని కూడా బ్రతికిస్తుంది... భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుంది అన్న దర్శకుడు త్రివిక్రమ్ డైలాగులు అక్షరాల నిజం అని నిరూపించారు కొందరు నటులు..సెలబ్రిటీలు. క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉండి కూడా క్యాన్సర్ మహమ్మారిని ఓడించారు. అలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్ మనీషా కోయిరాల క్యాన్సర్ ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఆరేళ్లపాటు క్యాన్సర్ తో పోరాటం చేసి విజయం సాధించారు. బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటి మనీషా కోయిరాలా. టాలీవుడ్ లో కూడా బొంబాయి, ఒకే ఒక్కడు వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించిన మనీషా కొయిరాలా రొమ్ము క్యాన్సర్ కు గురయ్యారు. కీమోథెరఫీ ట్రీట్ మెంట్ తో కోలుకున్నారు. ఇకపోతే అటు బాలీవుడ్..ఇటు టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న మరో నటి సోనాలి బింద్రే. ప్రిన్స్ మహేశ్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, శ్రీకాంత్ ల సరసన నటించి తెలుగు ప్రజలకు మరింత దగ్గర అయ్యారు. అయితే కొంత కాలంగా సోనాలి క్యాన్సర్ తో బాధపడిన సంగతి తెలిసిందే. విదేశాల్లో చికిత్స చేయించుకుని క్యాన్సర్ పై పోరాడి గెలుపొందారు. ఇదిలా ఉంటే 1980 దశకంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అలనాటి హీరోయిన్ గౌతమి సైతం రొమ్ము క్యాన్సర్ తో ఫైట్ చేశారు. 35 సార్లు రేడియోథెరెపీ ట్రీట్మెంట్ తీసుకుని ప్రస్తుతం తిరిగి సినిమాలలో నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa