ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాతాళ్ లోక్ వెబ్ సిరీస్ పై మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు

cinema |  Suryaa Desk  | Published : Sun, May 24, 2020, 10:23 AM

బాలీవుడ్ అందాల నటి అనుష్క శర్మ నిర్మాతగా మారి రూపొందించిన వెబ్ సిరీస్ పాతాళ్ లోక్‌కు మంచి ప్రేక్షకదారణ లభించింది.ఈ వెబ్ సిరీస్ విమర్శకులను సైతం ఆకట్టుకోవడం, మంచి రివ్యూలు రావడంతో యూనిట్ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఈ ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండటంతో సక్సెస్ పార్టీని నిబంధనలుకు లోబడి ఏర్పాటు చేసుకొన్నారు.ఈ వెబ్ సిరీస్ పలువురి ప్రశంసలను పొందింది. ఇదే సమయంలో విమర్శలను కూడా మూటగట్టుకుంది. ఈ సిరీస్ పై మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు నమోదైంది. 'ది ఆల్ అరుణాచల్ ప్రదేశ్ గూర్ఖా యూత్ అసోసియేషన్' సభ్యులు ఈ ఫిర్యాదు చేశారు.తమ గూర్ఖా సమాజాన్ని అవమానకరంగా చిత్రీకరించారని ఫిర్యాదులో ఆరోపించారు. రెండో ఎపిసోడ్ లో తమను కించపరిచే విధంగా ఒక సన్నివేశాన్ని చిత్రీకరించారని తెలిపారు. ఆ సీన్ లో వచ్చే డైలాగ్స్ వినపడకుండా మ్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అనుష్కశర్మకు గూర్ఖా సమాజానికి చెందిన కొన్ని వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. అనుష్కపై న్యాయపరమైన చర్యలు తీసుకునేలా పోరాడతామని తెలిపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa