ఛలో మూవీ హిట్ తో జోరుమీదున్న నాగశౌర్య మరో మూవీతో ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన తెలుగు, తమిళ మూవీ కణం ఈ నెల 23వ తేదిన విడుదల కానుంది.. ‘ఫిదా’. ఎంసిఎ మూవీలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకుని బోలెడంత క్రేజ్ ను సంపాదించుకున్న నటి సాయి పల్లవి ఈ మూవీలో హీరోయిన్.. ఈ సినిమాలో ఆమె ఒక బిడ్డకు తల్లిగా నటిస్తుండటం విశేషం..తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్ర తెలుగు హక్కుల్ని ఎన్వీఆర్ సినిమాస్ అధినేత ఎన్వీ ప్రసాద్ ఫ్యాన్సీ రేటుకి కొనుగోలుచేశారు.. త్వరలోనే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలకు వెళ్లనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa