ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోటోలు తీసినందుకు పిల్లవాడి ఫోన్ పగలగొట్టిన యాంకర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 06, 2018, 03:37 PM

యాంకర్ అనసూయ ఓ వివాదంలో చిక్కుకున్నారు. తమ మొబైల్ పగలగొట్టారంటు ఆమెపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తార్నాక ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు చెబుతోంది. ఓ బాలుడు తన తల్లితో పాటు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతోంది. దగ్గర్లో అనసూయ ఉండటాన్ని గమనించి దగ్గరకు వెళ్లాడు. తన మొబైల్ తీసుకొని కాస్త దూరంగా నిలబడి సెల్ఫీ తీసుకొనే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన అనసూయ ఆవేశంతో ఊగిపోయింది. ఫోన్ తీసుకొని నేలకేసి కొట్టారట. ఈ సీన్‌తో తల్లీకొడుకులు షాకయ్యారు. తమ ఫోన్ పగలగొట్టడంపై అనసూయను బాలుడి తల్లిని నిలదీసింది.


ఆ తర్వాత కూడా అనసూయ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందని బాధిత మహిళ ఆరోపిస్తోంది. తమను దుర్భాషలాడి... అక్కడి నుంచి వెళ్లిపోయారని చెబుతోంది. వెంటనే ఆమె ఉస్మానియా యూనివర్శిటీ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. యాంకర్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఆరోపణలపై అనసూయ కూడా స్పందించారు. మహిళ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని... పొరపాటున మొబైల్ పగిలి ఉంటే సారీ చెబుతున్నానని ట్వీట్ చేశారు. బాలుడి తల్లి చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు అనసూయ.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa