సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సంగీత దర్శకుడు వాజీద్ ఖాన్, డాన్సు మాస్టర్ సరోజ్ ఖాన్, జగదీప్ వంటి స్టార్లను కోల్పోయింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ బలవన్మరణానికి పాల్పడటం ఊహించని విషాదం. ఈ మధ్యే బాలీవుడ్ సినీ, టీవీ నటుడు రాజన్ సెహగల్, ప్రముఖ మోడల్, నటి, గాయని దివ్య చోక్సీ కూడా కన్నుమూశారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాజత్ ముఖర్జీ మరణించారు. దీంతో బాలీవుడ్ పరిశ్రమ విషాదంతో నిండింది.కొంత కాలంగా రాజత్ ముఖర్జీ అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతిచెందారని కుటుంబసభ్యులు తెలిపారు. రజత్ ముఖర్జీ జైపూర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. రజత్ ముఖర్జీ హిందీలో 'రోడ్, ప్యార్ తూనే క్యా కియా, లవ్ ఇన్ నేపాల్' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అతడు దర్శకత్వం వహించిన 'రోడ్' సినిమాకు సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించాడు. రజత్ ముఖర్జీ మృతి పట్ల ప్రముఖ మనోజ్ బాజ్ పాయి సంతాపం తెలిపారు. తన స్నేహితుడు రోడ్ దర్శకుడు రజత్ కన్నుమూశారని ట్వీట్టర్ వేదికగా తెలుపుతూ సంతాపం ప్రకటించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa