ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్షర హాసన్ పర్సనల్ మేకప్ మేన్ కరోనాతో మృతి

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 30, 2020, 11:29 AM

కమల్ హాసన్ చిన్న కూతురు అక్షరా హాసన్ పర్సనల్ మేకప్ మేన్ కోవిడ్ -19తో మృతి చెందినట్టు తన సోసల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. అక్షరా హాసన్ విషయానికొస్తే.. 2015లో ఆర్. బాల్కీ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, ధనుశ్ హీరోలుగా తెరకెక్కిన ‘షమితాబ్’ చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయమైంది. అజిత్ హీరోగా తెరకెక్కిన ‘వివేగం’ సినిమాతో తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అక్షరా హాసన్. ప్రస్తుతం ఈమె పలు తమిళ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా తన పర్సనల్ మేకప్ మేన్ కరోనాతో మృతి చెందినట్టు పోస్ట్ చేసింది. 2015లో అక్షరా హాసన్ హీరోయిన్‌గా పరిచమైనప్పటి నుంచి ఆమెకు సచిన్ దాదా పర్సనల్ మేకప్ మేన్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కోవిడ్ 19తో పోరాడి మృతి చెందినట్టు ప్రకటించింది అక్షరా. ఆయన కన్నుమూయడం తనతో తన కుటుంబ సభ్యులను ఎంతగానో కలిచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన కన్నుమూయడం తనకు పర్సనల్‌గా ఎంతో బాధ కలిగించిందని ఆయన కుటుంబీకులకు సానుభూతి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa