పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే మెగా హీరోలంతా సరికొత్త సినిమాలలో నటించి 2020 సంవత్సరం లో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాలి అనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా వీరందరి సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. తమిళనాడు మహారాష్ట్ర లతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతుంది. మొన్నటి వరకు సిటీల కే పరిమితమైన కరోనా వైరస్ ఇప్పుడు గ్రామాల్లో కూడా అడుగు పెట్టింది. జూన్, జులై నెలలలో కరోనా మరణాలు తగ్గడం, రికవరీ కేసులు పెరగడం, పాజిటివ్ కేసులు కూడా గమనించదగ్గ స్థాయిలో తగ్గడం కాస్త ఉపశమనం కలిగిస్తుంది కానీ ఈ మహమ్మారి ఎప్పుడు? ఎవరికి? ఎలా సంక్రమిస్తుందో? అన్న ఆందోళన ప్రతి యొక్క భారతీయడులో కలుగుతుంది. అందుకే సినీ సెలబ్రెటీలు కూడా చిత్రీకరణలో పాల్గొనాలంటేనే జంకుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన చిత్రాల విడుదలను 2021 వ సంవత్సరానికి వాయిదా వేసుకున్నారు. చిత్రీకరణ కూడా మెల్లగా పునః ప్రారంభిద్దామని చిత్ర బృందానికి చెప్పారు. ఇప్పటికే మూడు సినిమాల్లో కథానాయకుడి పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మరో రెండు చిత్రాల్లో కూడా నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఒక సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉండబోతోందని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. మరొక సినిమా మాత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న అని సినీ వర్గాల నుంచి టాక్ బలంగా వినిపిస్తుంది.
గతంలో మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమా కథ పవన్ కళ్యాణ్ కోసమే కొరటాల శివ రాశారట. కానీ ఏవో కొన్ని కారణాల వలన పవన్ కల్యాణ్ ఆ సినిమాలో నటించ లేకపోయారు. మళ్లీ ప్రస్తుతం పవర్ స్టార్ కోసం ఒక అదిరిపోయే కథను సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కిస్తే అభిమానులకు పండగే అని అందరూ తెగ చర్చించుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa