ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ ప్రధానపాత్రల్లో వచ్చిన చిత్రం మగధీర. టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం వచ్చి 11 ఏళ్లు అయిన నేపథ్యంలో రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మగధీర చిత్రం తనకో మధురానుభూతి అని, తనను ముందుకు నడిపించిన చిరస్మరణీయ అనుభవం అని పేర్కొన్నారు. ఆ చిత్రం తనలోని ప్రతి నైపుణ్యానికి పరీక్ష పెట్టిందని తెలిపారు.మగధీర చిత్రీకరణ సమయంలో చిత్ర యూనిట్ చూపించిన ప్రేమానురాగాలకు ముగ్ధుడ్నయ్యానని, విడుదలైన తర్వాత ప్రేక్షకుల ఆదరణ తనను మరింత సంతోషానికి గురిచేసిందని వివరించారు. "రాజమౌళి గారూ, పరిధులు దాటి ప్రతిభ చూపేలా నన్ను మీరెంతో ప్రోత్సహించారు, అంతేకాదు, కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుందని నాకు బోధించారు" అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa