ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రగ్స్ కేసులో మహిళా యాంకర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 25, 2020, 12:29 PM

శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు రోజురోజుకు సంచలనంగా మారుతుంది. తాజాగా కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీకి మంగళూరు సీసీబీ అధికారులు నోటిసులు జారీ చేశారు. వాట్సాప్ ద్వారా ఆమెకు నోటీసులు పంపినట్టు సమాచారం. ఈ కేసులో నిందితునిగా ఉన్న డ్యాన్సర్ కిశోర్ శెట్టి విచారణలో అనుశ్రీ పేరు చెప్పినట్టు సమాచారం. మంగళూరుకు చెందిన అనుశ్రీ బెంగళూరులో స్థిరపడ్డారు. టీవీ యాంకర్‌గా రాణించడంతో పాటు సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. దీని పై అనుశ్రీ స్పందించారు. 10 ఏళ్ల కిందట కిశోర్‌శెట్టి జతలో డ్యాన్స్‌ చేశాను తప్పా అతనితో తనకు అంత పరిచయం లేదని చెప్పారు. ఇక కిశోర్‌శెట్టి బెంగళూరులో కార్తీక్‌శెట్టి అనే నిందితునితో కలిసి కాలేజీల వద్ద డ్రగ్స్‌ అమ్మేవాడని తేలింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు హీరోయిన్లు,నటులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa