కొద్ది సేపటి క్రితం ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూశారు. ఆగస్టు 5న కరోనాతో చెన్నై ఎంజీఎంలో చేరిన ఎస్పీ బాలు ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్ను మూశారు. ఆయన జీవిత విశేషలను చూస్తే ఆయన పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. నెల్లూరు జిల్లా కోనేటమ్మకోటలో 1946 జూన్ 4న జన్మించారు. బాలు తల్లిదండ్రులు సాంబమూర్తి, శకుంతలమ్మ. 1966లో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమా కోసం తొలిసారి ఆయన గాయకుడి అవతారం ఎత్తారు. ఘంటసాల వారసత్వాన్ని అంది పుచ్చుకున్న బాలు, 50 ఏళ్ల ప్రస్థానంలో 14 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, తుళు ఒరియా, అస్సామీ, బడగ, సంస్కృతం, కొంకణి, బెంగాలి, మరాఠి, పంజాబీతో పాటు ఇంగ్లీషు బాషలలో ఆయన పాటలు పాడారు. అత్యధిక పాటలు పాడిన ఏకైక గాయకుడిగా ఎస్పీ బాలు గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి భారత అత్యున్నత పురస్కారాలు ఆయనకు దక్కాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాల నుండి లెక్కలేనన్ని పురస్కారాలను అందుకున్నారి బాలు. ఎన్నో నేషనల్ అవార్డులు, నంది అవార్డులు బాలు సొంతమని చెప్పాలి. 2016లో సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఆయనకు దక్కింది. సుమారు వందకు పైగా సినిమాలకు బాలు డబ్బింగ్ చెప్పారు. కమల్హాసన్, రజనీకాంత్, సల్మాన్ఖాన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లకి ఆయన తన గొంతు అరువిచ్చారు.
సుమారు 45 సినిమాల్లో నటనాకౌశలాన్ని ప్రదర్శించిన బాలు, కథానాయకుడిగా, సపోర్టింగ్ యాక్టర్ గానూ సత్తా చాటారు. 2012లో మిథునం సినిమాలో నటనకుగాను బాలుకు నంది పురస్కారం కూడా దక్కిఇంది. 45కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. మ్యూజిక్ డైరెక్టర్గా కూడా పలు పురస్కారాలను అందుకున్నారు బాలసుబ్రమణ్యం. గాయకుడిగా, స్వరబాణీలు అందించే సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, పాత్రలో ఒదిగి పోయి లీనమైపోయే నటుడిగా, మనసును హత్తుకునే సినిమాలను అందించిన నిర్మాతగా, భావితరాలకు గాయకులను అందిస్తున్న గురువుగా, తన కెరీర్లో పరిపూర్ణత సాధించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa