కథానాయిక పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం రెండు క్రేజీ సినిమాలున్నాయి. ప్రభాస్ హీరోగా వస్తున్న ‘రాధే శ్యామ్’ పాన్ ఇండియా సినిమాతో పాటు అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా కూడా ఉంది. అలాగే సల్మాన్ సరసన ‘కబీ ఈద్ కబీ దివాలీ’ చిత్రంలో నటించే బాలీవుడ్ ఆఫర్నీ పూజా దక్కించుకుంది. ఈ సినిమాల్లో ఏది సెట్ పైకి వచ్చినా.. తాను కాల్షీట్ ఇవ్వడానికి, షూటింగ్కు రావడానికి సిద్ధమే అంటోంది.
ప్రస్తుతం పూజా హెగ్డే బెంగళూరులో తన తల్లిదండ్రులతో కలిసి ఉంది. లాక్ డౌన్ మొదలైనప్పట్నుంచి ఇప్పటి వరకు ఆమె బయటకు రావట్లేదు. పూర్తిగా ఇంటికే పరిమితమైంది. దాంతో ఇప్పుడు షూటింగ్ చేయడానికి తను మానసికంగా.. శారీరకంగా కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. పూజా హెగ్డే కథానాయికగా రాణించాలని బాలీవుడ్లో విశ్వ ప్రయత్నాలు చేసింది. అయితే అక్కడ సరైన గుర్తింపు, అవకాశాలూ రాలేదు. దీంతో సౌత్పై ఫోకస్ చేసిన పూజా హెగ్డేకి తెలుగులో భారీ విజయాలు అందాయి. మంచి క్రేజ్ సొంతం చేసుకుని అగ్ర హీరొయిన్ గా రాణిస్తోంది. తెలుగునాట ఆమెకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. వీటిని చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి పూజా ఏకంగా తన మకాంని హైదరాబాద్కి ఫిష్ట్ చేసింది. హైదరాబాద్లో కొన్న ఓ లగ్జరీ ఫ్లాట్లోకి త్వరలోనే రానుంది.
‘ముగమూడి’ చిత్రం ద్వారా పూజా హెగ్డే తమిళ చిత్రసీమకు పరిచయమయ్యింది.. ఆ తర్వాత వరుసగా తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి బిజీగా మారిన సంగతీ తెలిసిందే. అయితే బాలీవుడ్ వైపునకు దృష్టి ఎందుకు సారించడం లేదని పూజని కదిలిస్తే.. ‘బాలీవుడ్ ముద్దే..కానీ అక్కడ హద్దులుండవ్. అన్నీ వదలుకోవలసిందే!’ అంటూ మనసు విప్పింది? ‘అన్నీ వదలుకోవలసిందే!’ అన్న మాటలో అర్థం ఏమిటో? పూజకే తెలియాలి సుమా!?
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa