ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నమ్రత-ఉపాసన.. ఎవరా అమ్మాయి??

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 31, 2017, 01:43 PM

ఇప్పుడు మాజీ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్.. అలాగే ప్రముఖ వ్యాపావేత్త ఉపాసన కామినేని.. ఇక్కడ మహేష్ బాబు అండ్ రామ్ చరణ్ ల జీవిత భాగస్వాములుగా బాగా పాపులర్. అందుకే వారు సెలబ్రిటీ వైఫ్ లుగా సోషల్ మీడియాలో ఏం పోస్టు చేసినా కూడా ఈ అభిమానులు అటెన్షన్ అనేది పీక్స్ లో ఉంటుంది. ఇదిగో ఇప్పుడు ఈ ఇద్దరూ కలసి ఒక పార్టీలో ఒక అమ్మాయికి ముద్దు పెడుతున్న ఫోటో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా కథ.  నిజానికి ఉపాసన అండ్ గ్యాంగ్ లోకి ఈ మధ్యనే నమ్రత కూడా ఎడిషన్ అయిపోయింది. ఆల్రెడీ ఆ మధ్యన మహేష్ అండ్ చరణ్ కూడా కలసి ఓ వెకేషన్ కు వెళ్ళారు.


గత రాత్రి ఒక బర్త్ డే పార్టీ జరగ్గా.. అక్కడ ఉపాసన-నమ్రత కలసి దియా భూపాల్ అనే అమ్మాయికి ముద్దుపెట్టారు. ఈమె ఎవరో కాదు.. అప్పట్లో అఖిల్ పెళ్ళి చేసుకోవాలని డ్రాప్ అయిన శ్రీయ భూపాల్ ఉంది చూశారు.. ఆమెకు వదిన. శ్రీయ అన్నయ్య కృష్ణ భూపాల్ ముందుగా డెక్కన్ క్రానికల్ అధినేత కూతురు గాయత్రి రెడ్డిని పెళ్ళిచేసుకోవడానికి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆ తరువాత ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని ముంబాయ్ కు చెందిన జ్యూయలరీ డిజైనర్ కూతురు ధియా మెహతా ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నిన్న ఆ పిల్లల బర్త్ డే సందర్భంగా ఇలా ఉపాసన అండ్ నమ్రత అక్కడ దియాకు ఇలా


ముద్దుపెట్టారు.  ఇక ఈ శ్రీయ భూపాల్ అండ్ కృష్ణ భూపాల్ ఎవరంటే.. వీరి తల్లి షాలిని స్వయంగా జివికె గ్రూపు అధినేత జివి కృష్ణా రెడ్డి కూతురు. ఇటు ఫాథర్ సైడ్ నుండి సోమ్భూ పాల్ ఫ్యామిలీకి చెందినవారు. ఈ సోమ్ భూపాల్ ఎవరో కాదు.. ఉపాసన వాళ్ళకు చుట్టాలైన వనపర్తి సంస్థానాదీశులు. ఉపాసన వాళ్ల డాడ్ ఫ్యామిలీ దొనకొండ సంస్థానాదీశులనే సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa