ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడవి శేష్‌ 'మేజర్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 29, 2021, 12:56 PM

యంగ్ హీరో అడవి శేష్ ప్రస్తుతం "మేజర్" సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి 'గూఢచారి' ఫేం శశి కిరణ టిక్కా దర్శకత్వం వహిస్తుండగా, సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శోభితా ధూళిపాళ్ల ఈ సినిమాలో కథానాయిక. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ రాగా.. తాజాగా రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ ను కూడా వదిలింది చిత్ర బృందం. ఈ మూవీని 2021, జూలై 2వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించింది. 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆదరిస్తోందో చూడాలి. కాగా.. క్షణం, గూఢచారి, ఎవరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa