ఇటీవల తన గురించి ఎలాంటి గాసిప్స్ రావడం లేదని ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్. అంతేకాదు వీటి వల్ల వచ్చే నష్టం, కష్టం ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసన్నారు. వాటిని ఎదుర్కొని నిలబడ్డానని, అందువల్ల తన గురించి వచ్చే గాసిప్స్ను పట్టించుకోకూడదని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. రకుల్ తెలుగు, తమిళం, కన్నడం, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె బాలీవుడ్లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులోను ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అదేసమయంలో ఈమె గురించి అనేక రకాలైన గాసిప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి.
ఇలాంటి వార్తలను చూసి కంగారుపడిన రకుల్ ప్రీత్.. వాటికి వివరణ కూడా ఇస్తూ వచ్చారు. విలేకరుల ప్రశ్నలకు నెమ్మదిగా సమాధానమిచ్చేవారు. దీంతో ఆమెపై వచ్చే గాసిప్స్ నిజమని చాలామంది నమ్మేవారు. కానీ, రకుల్ ప్రీత్ సింగ్ ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి గాసిప్స్పై ఇక స్పందించకూడదన్న నిర్ణయానికి వచ్చినట్టు తాజాగా చెప్పారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఇకపై ఇలాంటి వార్తలపై స్పందించనుగాక స్పందించను. నా గురించి గాసిప్స్ రాసే పాత్రికేయులే మనసు మార్చుకుని, నిలిపివేశారనీ, ఇకనుంచి కూడా ఇదే పంథాను అనుసరిస్తానని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రకుల్ నటించిన తెలుగు సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా బాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa