తాజాగా శ్రీలంకకు చెందిన ఓ మహిళ కోలీవుడ్ హీరో ఆర్య మోసం చేసి 70 లక్షలు దోచుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో ఆర్యను పోలీసులు ప్రశ్నించి నిర్దోషి అని నిర్ధారించారు. చెన్నై పులియంతోప్కు చెందిన మహమ్మద్ అర్మాన్, మహ్మద్ హుస్సేనీ అనే ఇద్దరు వ్యక్తులు శ్రీలంక మహిళను ఆర్యలా నటించి మోసం చేశారని పోలీసులు కనిపెట్టారు. ఈ మేరకు వాట్సప్ లో ఆ మహిళతో చేసిన ఛాట్ ను కూడా బయట పెట్టారు. ఈ వార్త తెలిసన వెంటనే చెన్నై పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్య ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. నిజమైన నేరస్థుడిని అరెస్ట్ చేసినందుకు కమిషనర్ ఆఫ్ పోలీస్, అదనపు పోలీస్ కమిషనర్-సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, చెన్నై సైబర్ క్రైమ్ టీమ్కి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం 'సర్పట్ట పరంపరై' సక్సెస్ ను ఆస్వాదిస్తున్న ఆర్యకు ఇది పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఈ సంఘటన తనను ఎంతగానో గాయపరిచిందని, ఈ విషయంలో తనను నమ్మిక ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa