తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో కొద్ది రోజుల పాటు ఈ కేసుకు సంబంధించి విచారణ జరగగా, ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసును విచారిస్తోంది. ఇవాళ్టి నుంచి డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభం కానుంది. ఈరోజు నుంచి 12 మంది సినీ ప్రముఖులను విచారించనుండగా, తొలిరోజున దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈడీ విచారణకి హాజరయ్యారు.
ఉదయం 10. 30 గంటలకు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండగా. 10. 05 గంటలకే ఆయన వచ్చేశారు. ఆయనతో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా పూరీ జగన్నాథ్ స్పందించలేదు. కారు దిగిన వెంటనే నేరుగా కార్యాలయంలోకి వెళ్లారు. మధ్యాహ్నం వరకు విచారణ సాగే అవకాశం ఉంది. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసులో నేటి నుంచి విచారణ ప్రారంభం కానుంది. జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని 8 మంది సభ్యుల టీం ప్రశ్నించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa