ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింగరేణి కాలనీ ఘటనపై మహేష్ బాబు సీరియస్!

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 14, 2021, 11:00 PM

హైదరాబాద్ నగరంలో చాలా కాలం తర్వాత ఒక దారుణమైన అత్యాచార ఘటన అందరినీ కలచివేసింది. సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై ఒక రాక్షసుడు అతి దారుణంగా తన రాక్షసత్వాన్ని చూపించడంతో అలాంటి వారికి భూమిమీద బ్రతికే అర్హత కూడా లేదని 24 గంటల్లోనే ఉరితీయాలని ఇప్పటికే చాలామంది స్పందించారు. ఇక మంచు మనోజ్ తనదైన శైలిలో బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలిచాడు. ఇక మెల్లగా మిగతా సినీ తారలు కూడా నిందితుడికి వీలైనంత త్వరగా శిక్ష పడాలని కోరుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మరోసారి తన వివరణ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడిని వదిలి పెట్టకూడదని కూడా మహేష్ బాబు తీవ్రస్థాయిలో సోషల్ మీడియా ద్వారా స్పందించారు.


ఇటీవల సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై 30 ఏళ్ల యువకుడు దారుణంగా అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన రోజు నుంచి కూడా పోలీసులు ఆ రాక్షసుడి కోసం గాలిస్తున్నారు. పాపపై అత్యాచారం చేయడమే కాకుండా అతి దారుణంగా చంపేసిన నిందితుడు వివరాలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన పోలీసులు పట్టించిన వారికి పది లక్షల కూడా ఇస్తామని తెలిపారు. ఇక ఈ ఘటనపై సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వివరణ ఇచ్చారు. సింగరేణి కాలనీలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన ఘోరమైన నేరంతో మనం సమాజం ఎంత దారుణంగా పడిపోయిందో గుర్తు చేస్తుంది. "మన కుమార్తెలు ఎప్పుడైనా సురక్షితంగా ఉంటారా?" అనేది ఎల్లప్పుడూ ఒక పెద్ద ప్రశ్నగా మారుతోంది. ఇది నిజంగా చాలా కలతపెట్టే విషయం. అసలు మన దగ్గర ఏమి జరుగుతుందో ఊహించలేము.. అని ట్వీట్ చేశారు.


ఇక మరొక ట్వీట్ లో మహేష్ బాబు వీలైనంత త్వరగా ఈ కేసు విషయంలో చర్యలను తీసుకోవాలని చిన్నారికి మరియు ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను నేను కోరుతున్నాను! అంటూ.. మహేష్ బాబు వివరణ ఇచ్చారు. ఇక మహేష్ బాబు చేసిన ఆ ట్వీట్ నిమిషాల్లోనే వైరల్ గా మారింది. అభిమానులు కూడా ఆ ట్వీట్ వైరల్ అయ్యేలా చేస్తూ.. నిందితుడి వివరాలను కూడా జత చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa