దేవాకట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ కలిసి నటిస్తున్న సినిమా "రిపబ్లిక్". ఈ సినిమాలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. ట్రైలర్ లోని డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ట్రైలర్ లింక్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడని చెప్పారు. రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న సాయి తేజ్ కోరిక మేరకు అదే తేదీన సినిమా విడుదల అవుతుందని చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రేక్షకుల ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష అని చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష.
Launching the trailer :https://t.co/mdA3ILcZld@IamSaiDharamTej
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2021
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa