జనసేనాని పవన్ కళ్యాణ్, మేనల్లుడు సాయిధరమ్ తేజ 'రిపబ్లిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ ప్రభుత్వ పనితీరును తనదైన శైలిలో విమర్శించిన సంగతి తెలిసిందే. టిక్కెట్లను ఆన్ లైన్ లో అమ్మాలనుకుంటున్న తీరును తూర్పారబట్టారు. అంతేకాదు.. ప్రభాస్, రానా లాంటి హీరోలు కండలు పెంచితే, బన్నీ, యన్టీఆర్ డ్యాన్సులు చేస్తే , రామ్ చరణ్ గుర్రపు స్వారీలతో సాహసాలు చేస్తేనే మాకు డబ్బులు వస్తాయని, కాంట్రాక్టులతో మాకు తేరగా డబ్బలు రావడం లేదంటూ.. సి.యం జగన్ తో పాటు , పార్టీ మంత్రులపై కూడా విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ అలా విమర్శించడంతో వైసీపీ పార్టీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తనదైన శైలిలో స్పందించిన సంగతీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు ఎక్కడ మాట్లాడాలో తెలియదన్నారు. సి.యం జగన్ కి, పవన్ కళ్యాణ్ కి అసలేమాత్రం పోలిక లేదన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ పై మరికొన్ని వివాదాత్మకమైన వ్యాఖ్యలు చేశారు పోసాని.
పోసాని అలా మాట్లాడడంపై సినీ ఇండస్ట్రీలో ఆయన తీరుపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. కొందరు సినీ పెద్దలు పోసాని మాట్లాడిన విధానాన్ని తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాడాటర్ కొణిదెల నిహారిక తన బాబాయ్ పవన్ పై పోసాని చేసిన వ్యాఖ్యలకు మండిపడుతూ.. 'తక్షణం పోసానిని మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలని, ప్రభుత్వం స్పందించి అతడిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సినిమా ఫంక్షన్ లో తన బాబాయ్ ఎవరి ఆడవాళ్ళను ఉద్దేశించి ఎటువంటి కామెంట్లు చేయలేదని, కేవలం జగన్ మెప్పుకోసమే... పోసాని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు' అని ఫైర్ అయ్యారు నిహారిక.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa