గోరెటి వెంకన్న , తెలుగు సాహిత్యానికి , ఆయన రాసే పల్లె పదాలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. ఐతే తనకి తన కవితలకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం అనేది కూడా చాల సంతోషకరమైన విషయమే. ఐతే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రాజ్య సభ M.P . విజయ సాయి రెడ్డి కూడా "కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన ప్రజాకవి, తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులు శ్రీ గోరటి వెంకన్న గారికి శుభాభినందనలు. అచ్చమైన పల్లె పదాలతో ఆయన రాసిన 'వల్లంకి తాళం' కవితా సంపుటికి 2020-21 ఏడాదికి గానూ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రకటించడం గర్వకారణం." అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిమానాన్ని పంచుకున్నారు.
ఇలాంటి అవార్డులు , గుర్తింపు ఇంకా మన తెలుగు ప్రజలలో ఎక్కువగా రావాలి అని కొంత మంది సినీ వర్గాలు ఆకాంశిస్తున్నాయి. గోరేటి వెంకన్న భారతదేశంలోని మహబూబ్నగర్లో 1963లో జన్మించారు, ఒక గీత రచయిత, కవి, గాయకుడు గా అందరికి పరిచయమైనాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa