పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రాబోయే ప్రాజెక్ట్స్ లో ఒకటైన క్రిష్ దర్శకత్వం వహిస్తున "హరి హర వీర మల్లు" సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా ట్రాక్ లో భారీ స్థాయిలో మౌంట్ చేయబడుతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం మేకర్స్ భారీ సెట్ని నిర్మించగా, షూటింగ్ ఏప్రిల్ 6, 2022 నుండి ప్రారంభం కానుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, పవన్ నాన్స్టాప్గా షూటింగ్ను కొనసాగించి, ఆగస్ట్ నాటికి ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నోరా ఫతేహి, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించనున్నారు. 'హరి హర వీర మల్లు' సినిమాని అక్టోబర్ 5న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ తేదీన ఈ మూవీ రిలీజ్ అవుతుందో లేదో వేచి చుడాలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa