ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈనెల 29న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ బెటాలియన్ మైదానంలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్ కు చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శ్రీనివాస్, ఇతర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. భారీగా అభిమానులు తరలిరావడంతో ఈ కార్యక్రమం వేడుకగా సాగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa