ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ని ప్రాంతాల్లో లాభాలు పండిస్తున్న కేజీఎఫ్ 2... అక్కడమాత్రం తీవ్ర నష్టాలు

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 28, 2022, 01:37 PM

కేజీఎఫ్ ఫ్రాంచైజీ తో దేశవ్యాప్త క్రేజును సొంతం చేసుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్. 2018లో చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టడంతో దీనికి కొనసాగింపుగా వచ్చిన కేజీఎఫ్ 2 పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 ను రూపొందించారు. హోంబలే ఫిలిం బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధిశెట్టి నటించగా, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను వసూలు చేస్తోంది. విడుదలై రెండు వారాలు గడుస్తున్నా అన్ని చోట్లా కూడా కేజీఎఫ్ 2 జోరు ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. కేజీఎఫ్ 2 బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.  కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మాత్రం ఈ చిత్రం బయ్యర్లకు నష్టాలను మిగిల్చేలా ఉంది. రూ. 49 కోట్లకు కొనుగోలు చేసిన కేజీఎఫ్ 2 కు ఇప్పటివరకూ అక్కడ కేవలం రూ. 36.28 కోట్లను మాత్రమే వసూలు చేసింది. కారణం-టికెట్ రేట్లు అన్ని చోట్ల కన్నా ఆంధ్రాలో తక్కువగా ఉండటం. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి బయ్యర్లకు లాభాలు రావాలంటే, మరో 12 కోట్లను కలెక్ట్ చెయ్యాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అంత పెద్ద మొత్తాన్ని వసూలు చెయ్యటమంటే చాలా కష్టమనే చెప్పాలి. పైగా రేపు ఎన్నో అంచనాల మధ్య చిరంజీవి, చరణ్ ల ఆచార్య విడుదల కాబోతుంది. మరి ఆచార్య తో పోటీపడి కేజీఎఫ్ 2 ఏపీలో బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేక చిరు ధాటికి తట్టుకోలేక చతికిల పడుతుందా.... అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa