టాలీవుడ్ మాస్ యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తనకు లక్ష్యం, లౌక్యం వంటి బిగ్ హిట్ ఇచ్చిన శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ తన తదుపరి సినిమాను చేస్తు న్నాడు. ప్రస్తుతం కర్ణాటకలోని మైసూరులో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. డూప్ లేకుండా ఒక యాక్షన్ సీన్లో నటిస్తున్న గోపీచంద్ అనుకోకుండా ప్రమాదానికి గురయ్యాడని ఆ చిత్ర దర్శకుడు శ్రీవాస్ తెలిపారు. గోపీచంద్ కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయాడని, అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందనీ, అభిమానులు ఖంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. పోతే... ఈ సినిమాకు లక్ష్యం 2 అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట చిత్రబృందం. శ్రీవాస్-గోపీచంద్ కాంబోలో రానున్న మూడో సినిమా కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa