దాదాపు పదకొండేళ్ల తదుపరి మళ్ళీ పట్టాలెక్కబోతున్న సూపర్ హిట్ డైరక్టర్ హీరో కాంబో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్. దీంతో ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అవ్వబోతున్నట్టు తెలిపి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసారు.
ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.