కోలీవుడ్ సీనియర్ హీరో కమల్ హాసన్ తన ఐకానిక్ మూవీ "ఇండియన్" (తెలుగులో భారతీయుడు) కు సీక్వెల్ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. కొన్ని నాటకీయ పరిణామాల తదుపరి ఇటీవలే ఈ మూవీ పునఃప్రారంభించబడింది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్ధ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీకి రచయితగా పనిచేస్తున్న జైమోహన్ సినిమా నిడివి 3గంటల 10 నిమిషాలుగా పేర్కొన్నారు. ఐతే మరి ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రం ఇదే రన్ టైంను ఫిక్స్ చేసుకుంటుందా లేక మార్చుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa