రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ పోలీసులు పిలుపు మేరకు గురువారం ఆమె పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఢిల్లీలోని మందిర్మార్గ్లోని ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ కార్యాలయానికి నోరా ఫతేహి వచ్చారు. ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ నుంచి ఆమె అందుకున్న ఖరీదైన బహుమతులు, ఇతర ఆర్థిక పరమైన లావాదేవీల గురించి పోలీసులు 6 గంటల పాటు ఆమెను ప్రశ్నించారు.