ధృవన్ కటకం, నియా త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం "బలమెవ్వడు". సత్య రాచకొండ ఈ సినిమాకు డైరెక్టర్. శ్రీజయ గోదావరి చిత్రాలయ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సత్యప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ విడుదల తేదీని ఖరారు చేస్తూ మేకర్స్ అఫీషియల్ నోట్ రిలీజ్ చేసారు. సెప్టెంబర్ 30వ తేదీన ఈ చిత్రం ధియేటర్లలో విడుదల కాబోతుందని ప్రకటించారు.
ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. సుహాసిని మణిరత్నం, పృథ్విరాజ్, నాసర్ కీలకపాత్రలు పోషించారు.