ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకాష్ పూరి సరసన గాయత్రి భరద్వాజ్‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 28, 2018, 02:59 PM

దర్శకుడు పూరి జగన్నాథ్‌ పరిచయం చేసే హీరోయిన్లు ఆ తర్వాత టాలీవుడ్‌లో మంచి పొజీషన్‌కు చేరుకున్నారు. ఆయన చిత్రాల్లో నటించాలని చాలా మంది నాయికలు కోరుకుంటారు. తాజాగా పూరి మరో కొత్త నాయికను పరిచయం చేస్త్తున్నారు. ఈసారి తను దర్శకత్వం చేయడం లేదు. తన శిష్యునితో సినిమా తీస్తున్నారు. పూరి తనయుడు ఆకాష్‌ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఆకాష్‌ను పూర్తిస్థాయి హీరోగా పరిచయం చేస్తూ ‘మెహబూబా’ అనే చిత్రాన్ని పూరి తెరకెక్కించారు. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితం పొందలేకపోయింది. మరో ప్రయత్నంగా ఆకాష్‌ను ప్రమోట్‌ చేసేందుకు తీస్తున్న ఈ చిత్రానికి పూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ‘వాస్కోడిగామా’ అనే పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇకపోతే ఇందులో మోడల్‌ గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్‌గా నటిస్తుందని తెలిసింది. పూనేకు చెందిన గాయత్రి డెంటల్‌ స్టూడెంట్‌. ఈ చిత్రానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa